ఇక కూతురు మృతి చెందింది అన్న వార్త తెలుసుకున్న తల్లి దండ్రులు గుండె పగిలి పోయింది. దీంతో ఓ దేవుడా నీకు జాలి దయ లేదా మాకు కడుపు కోత మిగిల్చావు అంటూ అరణ్య రోదనగా ఆ తల్లి దండ్రులు విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. మద్నూర్ మండలానికి చెందిన పెద్ద ఎక్షర బాలికల గురుకుల పాఠశాలలో చదువు కుంటుంది శిరీష అనే బాలిక.
అయితే ఇటీవలే పాఠశాల ఆవరణ లో ఉన్న నీటి ట్యాంకులు పదిహేడేళ్ల శిరీష విగతజీవిగా కనిపించింది. దీంతో ఈ ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది. నిజాంసాగర్ మండలం ముద్దనూరు గ్రామవాసి అయిన శిరీష మృతి ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక శిరీష ది హత్యా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.