కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజలందరిలో ప్రాణభయం మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎక్కడ ఎలాంటి ఘటన జరిగిన జనాలు భయపడిపోతున్నారు.. ఇక ఎక్కడైనా జంతువులు కాస్త ఎక్కువ సంఖ్యలో మరణించాయి అంటే చాలు అక్కడ ఏదైనా కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందేమో అని వణికిపోతూ ఉన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ తో బెంబేలెత్తిపోతున్నారు జనాలను భయపెట్టేందుకు అటు బర్డ్ ఫ్లూ కూడా కొన్ని రాష్ట్రాలలో మొన్నటివరకు విపరీతంగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడ మనుషులకు వ్యాప్తి చెంది ప్రాణాల మీదకు తెస్తుందో అని అందరూ భయపడ్డారు.


 ఇకపోతే ఇటీవల ఏకంగా ఒకేసారి వందల సంఖ్యలో కుక్కలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇలా ఒక్కసారిగా కుక్కలు చనిపోవడానికి కారణం ఏంటి ఏదైనా కొత్త వైరస్ వచ్చిందా అని భయపడిపోయారు. కానీ ఆ తర్వాత మాత్రం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూగజీవాల పట్ల ఒక సర్పంచ్ చేసిన పని  ఇలా వందల సంఖ్యలో కుక్కల మరణానికి కారణం అనేది తెలుస్తుంది. విషం ఇంజక్షన్లు ఇవ్వడంతోనే మూగజీవాల అయినా కుక్కలు మృతి చెందినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో వెలుగులోకి వస్తుంది ఈ ఘటన.


 ఇటీవలే ఒక వ్యక్తి తన పెంపుడు కుక్క చనిపోవడంతో హైదరాబాద్ లోని యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపాడు. ఈ క్రమంలోనే సంస్థ సభ్యులు ఇటీవలే గ్రామానికి వచ్చి విచారించారు. అయితే ఇటీవలే కుక్కల బెడద పై గ్రామస్తులు పలుమార్లు పంచాయితీకి ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ భాను ప్రకాష్ రావు చెబుతున్నారు. అయితే పంచాయతీ కార్యదర్శి తో కలిసి తాను కుక్కలకు విషపు ఇంజక్షన్ చెప్పినట్లు తెలిపారు. ఈ విషం వల్ల వందకు పైగా శునకాలు చనిపోయాయని వాటి కళేబరములను గ్రామ పరిసరాల్లో పూడ్చి వేసినట్లు తెలిపారు. ఈ విషయంపై సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది..

మరింత సమాచారం తెలుసుకోండి: