సాధారణంగా ఎవరైనా సరే ఇక ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను చోరీ చేయడం లాంటివి చూశాము. మహిళలు ఒంటరిగా కనిపిస్తే వారి మెడలో నుంచి బంగారు గొలుసులు లక్కేళ్ళటం లాంటివి కూడా చూశాం. ఇక మరికొన్ని సార్లు విచిత్రమైన దొంగతనాలు చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక వంతెన దొంగలించారు. 500 టన్నుల వంతెనను చోరీ చేయడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన బీహార్లోని రోతహాస్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరు మంది నిందితులను అరెస్టు చేశారు.



 అయితే ఇలా వంతెన చోరీ కేసులో ఆర్జేడీ నేత కూడా ఉన్నారు అన్న వార్త బయటకు వచ్చి సంచలనం మారిపోయింది. అంతే కాదు నిందితుల దగ్గర్నుంచి గ్యాస్ కట్టర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీటిపారుదల శాఖలో చేస్తున్న ఉద్యోగి అరవింద్ కుమార్ ఆర్జేడీ నేత శివకళ్యాణం భరద్వాజ్, చందన్కుమార్, సచ్చిదానంద సింగ్, మనీష్ కుమార్ గోపాల్ కుమారులను అరెస్టు చేశారు పోలీసులు. నీటిపారుదల శాఖ ఉద్యోగి అరవింద్ వాహనంలో వంతెన సామాగ్రిని ఒక చోట నుండి మరొక చోటికి తరలించినట్లు పోలీసులు విచారణలో తేలింది అంటూ చెప్పుకొచ్చారు.


రోహ్‌తాస్ జిల్లాలో 60 అడుగుల పాడుబడిన వంతెనను పట్టపగలు దొంగలించడం సంచలనంగా మారింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులం అంటూ చెబుతూ   గ్యాస్ కట్టర్లు, ఎర్త్ మూవర్ మిషన్లతో వంతెనను కూల్చివేసి చోరీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కొందరు జేసీబీ, గ్యాస్ కట్టర్ వంటి యంత్రాలతో వంతెనను ఫోన్ కూల్చేశారు అన్న సమాచారాన్ని గ్రామస్తులు అందించినట్లు  నీటిపారుదల శాఖ జూనియర్ ఇంజనీర్ అర్షద్ కమల్ షంషీ తెలిపారు. తాము ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశామని షంషీ చెప్పుకొచ్చారు. 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తున్న వంతెన ఒక్కసారిగా మాయమైపోవడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. 1972లో అమియావర్‌లోని ఆరా కాలువపై ఈ వంతెనను నిర్మించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: