నేటి రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు.. ఏదైనా సరే ఇట్టే నేర్చుకో గలుగుతున్నారు. మన కాలంలో  ఆడుకుంటూ లోకం గురించి కూడా తెలియని వయసుల నేటి రోజుల్లో పిల్లలు మాత్రం అద్భుతాలు కూడా సృష్టిస్తూ ఉన్నారు. చిన్న వయసులోనె తమ ప్రతిభతో ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అన్నింట్లో ఎలాగైతే పిల్లలు ఫాస్ట్ గా ఉన్నారో అటు ఆత్మహత్యలు చేసుకోవడం అన్నది అర్ధమవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న పిల్లలు సైతం ఏమీ తెలియని వయసులో కూడా చివరికి సూసైడ్ చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.



 ఇటీవలే సెల్ఫోన్ కి బానిసలుగా మారిపోతున్న పిల్లలు చదువును పక్కన పెట్టేస్తున్నారు. అయితే సెల్ఫోన్ ను పక్కనపెట్టి ముందు చదువుకోవాలి అంటూ తల్లిదండ్రులు కాస్త మందలించారు అంటే చాలు చివరికి ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా చిన్నచిన్న ఘటనల కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఆరో తరగతి చదువుతున్న బాలుడు మొబైల్ లో ఆన్లైన్ గేమ్ లకు బానిస గా మారిపోయాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఈ స్కూల్ కి వెళ్ళి వచ్చాడు. ఇక గేమ్ ఆడుకోవాలి ఫోన్ ఇవ్వండి నాన్న అంటూ అడిగాడు. తండ్రి ఇవ్వను అంటూ చెప్పడంతో సూసైడ్ చేసుకున్న  ఘటన తమిళనాడులోని పొల్లాచ్చిలో వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఇవ్వనందుకు ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిన బాలుడు ఎంతకీ బయటకి రాలేదు. ఏం చేస్తూ ఉన్నాడా అని తల్లిదండ్రులు వెళ్లి చూడగా  ఉరి వేసుకుని కనిపించాడు. ఇక ఈ ఘటనతో స్థానికంగా సంచలనం గా మారిపోయింది. చిన్న కారణానికి తమ కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఘటనపై కేసు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: