రక్తం పంచుకుని పుట్టిన వారి విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించకుండా దారుణంగా ప్రాణాలను తోడేస్తున్నారు. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా తనకు పెళ్లి చేయడం లేదన్న కారణంతో కనిపెంచిన తండ్రిని దారుణంగా హత్య చేయడానికి కూడా సిద్ధమయ్యాడు కొడుకు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో తండ్రి ప్రాణాలను తీసేసాడు. ఘటన కడలూరు జిల్లా పాలయం కోట కిల్ పాది ప్రాంతం లో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన లుర్తుస్వామి అనే అరవై ఏళ్ల వ్యక్తికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.
అయితే ఇతని పెద్దకుమారుడు 39 ఏళ్ల జాన్సన్ చదువుకోలేదు. కానీ మిగతా ఇద్దరు కుమారులు మాత్రం బాగా చదువుకొని ప్రస్తుతం మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలోనే మద్యానికి అలవాటు పడ్డాడు జాన్సన్. తరచూ తాగి వస్తు ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు. ఇక మద్యం మత్తులోనే ఇంటికి వచ్చి తల్లి, తండ్రి వద్ద తనకు వివాహం చేయమని గొడవకు దిగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అర్ధరాత్రి సమయంలో మరోసారి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన జాన్సన్ పెళ్లి చేయాలంటూ తండ్రితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన జాన్సన్ బండరాయితో కొట్టి చంపేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు..