సాధారణంగా పోలీసులు అంటే ఎప్పుడూ ఎంతో ధైర్యం గా ఉండాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు రక్షణ కల్పించేందుకు ముందుండాలి. ధైర్య సాహసాలకు మారుపేరు గా ఉండాలి. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాదు తమకు ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యం గా నిలబడి పరిష్కరించు కోవాలి. కానీ ఇక్కడ ఒక పోలీస్ అధికారి కి ఏం కష్టం వచ్చిందో ఏమో. చివరికి ఆయన మనసు గాయ పడింది. దీంతో చివరికి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది.
కాకినాడ జిల్లా సర్పవరం లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. అయితే పోలీస్ అధికారులు మాత్రం వేరేలా చెబుతున్నారు. మిస్ ఫైర్ జరిగిన కారణంగానే ఎస్ఐ మృతి చెందాడని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించినట్లు చెప్పుకొచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. ఎస్సై మృతి పట్ల విచారణ కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ విచారణలో ఎస్ ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా మిస్ ఫైర్ అయ్యిందా అన్న విషయాన్ని తేల్చి చెబుతున్నారు..