దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యంగా గుండె మీద చేయి వేసుకుని నిద్ర పోతున్నారు అంటే అందుకు కారణం సరిహద్దుల్లో నిద్రాహారాలు లేకుండా క్లిష్ట పరిస్థితుల మధ్య శత్రువులు దేశం లోకి చొరబడ కుండా  పోరాటం చేస్తున్న సైనికులే కారణం అని చెప్పాలి.  కుటుంబానికి దూరంగా సాధారణ ప్రజలు బ్రతక లేని పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న సైనికులు దేశ రక్షణ కోసం పహారా కాస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సరిహద్దులో ఎవరైనా శత్రుదేశాల అనూహ్యంగా దాడులకు పాల్పడితే కొన్ని కొన్ని సార్లు ఇక దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం అర్పిస్తూ ఉంటారు సైనికులు.


 అందుకే ప్రతి ఒక్కరు కూడా సైనికులకు ఎనలేని గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సరిహద్దుల్లో పహారా కాస్తూ శత్రుదేశాల కాల్పుల్లో మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు  ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతు ఉంటారు సైనికులు. ఇలా ప్రాణాలు కోల్పోతున్న వారి  సంఖ్య కూడా పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఊహించని సంఘటన జరిగింది. ఊహించని ప్రమాదం కారణంగా ఏకంగా ఆరుగురు జవాన్లు మృతిచెందిన ఘటన కాస్త దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. వర్షాకాలం కావడంతో అప్పుడప్పుడు కొండచరియలు విరిగి పడటం లాంటివి జరుగుతూ ఉంటుంది.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది.. మణిపూర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనే జిల్లా తుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంపు వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ క్రమంలోనే ఈ ఘటనలో ఆరుగురు సైనికులు దుర్మరణం పాలయ్యారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 13 మంది జవాన్లను బయటికి తీశారు. ఇక జవాన్లకు తీవ్ర గాయాలు అవ్వగా.. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించిన మణిపూర్ ముఖ్యమంత్రి బిరేష్ సింగ్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక గాయపడిన  సైనికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: