పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్స్ బస్సు సోమవారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయింది. అయితే విద్యార్థులను దింపి వేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఎదురుగానే బస్సును పార్క్ చేసినట్లు డ్రైవర్ చెబుతున్నాడు.. దీంతో అంత పెద్ద బస్సు ఏమై ఉంటుందా అని అందరూ వెతకడం ప్రారంభించారు. చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే కొన్ని గంటల తర్వాత రేగిడి ఆమదాలవలస మండలం మీసాల డోల పేట సమీపంలో ఇక బస్సు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే వేలిముద్రలు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇక పోలీసు విచారణలో భాగంగా బయటపడిన నిజం తెలిసి పోలీసులు సైతం అవాక్కయ్యారు అనే చెప్పాలి. గోకర్ణ పల్లికి చెందిన సురేష్ అనే వ్యక్తి మద్యం తాగి.. అదే మత్తు లో ఇక ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కనే ఆగివున్న బస్సును తీసుకు వెళ్ళాడు అన్న విషయం తేలింది. పోలీసులు సురేష్ ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు. అయితే సురేష్ చెప్పిన విషయం తో పోలీసులు సైతం అవాక్కయ్యారు అని చెప్పాలి. అయితే సోమవారం రాత్రి బస్సు తీసుకుని వంగర చేరుకుని తిరిగి ఇంటికి వెళ్లడానికి అదే వాహనాన్ని తీసుకు వెళ్లినట్లు సురేష్ పోలీసులకు తెలిపాడు.