ఇక అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసే విధి సంతోష పడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు అరణ్యరోదన లో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది. ఉదయం సమయంలో పొద్దెక్కినా కూతురు ఇంకా నిద్ర లేవ లేదు. ఆడుకొని అలసిపోయి ఉంటుంది అందుకే పడుకుందేమో అని అనుకుంది తల్లి. కానీ చివరికి తన కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది అని మాత్రం ఊహించలేకపోయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్ళపాడు తండా సమీపంలో గల మరో తండా లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హరి, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా కుమార్తె పావని తండాలోని పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. ఇటీవలే రాత్రి సమయంలో తల్లితో కలిసి నిద్రించింది పావని. కాగా తెల్లవారుజామునే నిద్ర లేచిన తల్లి సుజాత ఎప్పటిలాగానే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది. అయితే పావని పొద్దెక్కినా నిద్ర లేవ లేదు. హాయిగా కూతురు నిద్ర పోయింది అనుకుంది తల్లి. కానీ ఎంతకీ నిద్ర లేకపోవడంతో అనుమానం వచ్చి నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఉలుకు పలుకు లేదు. భయపడి భర్త హరికి విషయం చెప్పింది. అతను వచ్చి చూడగా పావని శరీరం చల్లబడటం తో పాటు నాడీ స్పందన లేకపోవడంతో కూతురు చనిపోయింది నిర్ధారించుకున్నారు. పావని శరీరం ఆకుపచ్చగా మారడంతో విషపురుగు కుట్టిందని స్థానికులు అంటున్నారు.. దీంతో తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు.