సాధారణంగా భార్యాభర్తల బంధం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇక ఇలా చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడే భార్యాభర్తలు బంధం కాస్త బలపడుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇక ఎన్ని గొడవలు జరిగిన కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా జీవించాలి అని సూచిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలతోనే కోపోద్రిక్తులుగా మారిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.  ముఖ్యంగా ఆడ మగ అనే తేడా లేని నేటి సమాజంలో కూడా భార్యలు ఇంట్లోనే ఉండాలని ఉద్యోగం చేయకూడదు అంటూ భర్తలు రూల్స్ పెడుతూ ఉండడం గమనార్హం.


 ఇదే విషయంపై భార్యలతో గొడవ పడుతూ దారుణానికి కూడా పాల్పడుతున్నారు. బీహార్ లో ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. బీహార్ లోని సిర్హాల్ అనే గ్రామంలో సీతాదేవి అనే మహిళ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంది. అయితే ఆమెకు కొంత కాలం క్రితమే మహేష్ రామ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సీత ఉద్యోగానికి వెళ్లడం మహేష్ కు నచ్చలేదు.  ఈ విషయంపై భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు.  సీత మాత్రం తన కాళ్ళ మీద తాను నిలబడతాను అంటూ భర్తతో చెప్పేసింది. చివరికి భర్త వేధింపులు తట్టుకోలేక ఏడాదికాలంగా భర్తకు దూరంగానే ఉంటుంది.


 ఇటీవలే మరోసారి సీతాదేవి దగ్గరికి వెళ్లి ఉద్యోగం మానేసి తనతో పాటు రావాలని మహేష్ కోరాడు. నీతో వస్తాను కానీ ఉద్యోగం మానేసే ప్రసక్తి లేదు అంటూ తేల్చి చెప్పింది భార్య. ఇక ఇద్దరి మధ్య మాట పెరిగిపోయి తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన మహేష్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సీతను దారుణంగా పొడిచాడు. తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సీతాదేవి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించారు ఎవరికి చికిత్స పొందుతూ సీతాదేవి కోలుకుంది. ఇకపోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: