సాధారణంగా ఏ తండ్రి అయినా సరే తన కొడుకు పెడదారి పడుతున్నాడు అని తెలిస్తే ఎంతో బాధ పడిపోతూ ఉంటాడు. సన్మార్గంలో నడవాలని సూచనలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మందలించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఇలా మందలించడమే తండ్రిని కొడుకుకు శత్రువుగా మార్చింది. చివరికి ఇది మనసులో పెట్టుకున్న కొడుకు తండ్రిని దారుణంగా హతమార్చాడు అని చెప్పాలి. ఈ ఘటన కర్నూలు జిల్లా కొసగిలో వెలుగులోకి వచ్చింది.
నాగన్న గేరి కాలనీకి చెందిన నర్సింలు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడు. దీనికి తోడు ఇక మధ్యానికి బానిసగా మారిపోయాడు. అంతేకాదు ఒక అమ్మాయిని కూడా వేధిస్తున్నాడు అన్న విషయం తండ్రి వీరయ్య చెవిన పడింది. అయితే తీరు మార్చుకోవాలి అంటూ రెండు రోజుల క్రితం తండ్రి కొడుకు నరసింహులు మందలించాడు. ఇక ఇది మనసులో పెట్టుకున్న నర్సింలు తండ్రిని హతమార్చాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక తండ్రి రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో దారుణంగా గొడ్డలితో మెడ పై నరికి చంపాడు. అంతటితో ఆగకుండా రక్తం కారుతున్న గొడ్డలితోనే వీధిలో హల్చల్ చేశాడు. ఇక అతన్ని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.