ప్రతి మనిషి జీవితంలో ఎన్ని రకాల బంధాలు ఉన్నప్పటికీ అటు భార్యాభర్తల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒంటరిగా ఏకాకిగా సాగిపోతున్న ఒక జీవితానికి పెళ్లి ఒక ప్రత్యేకమైన ఘట్టం తోడును అందజేస్తుంది. అయితే ఈ తోడు ఇక కలకాలం కష్టసుఖాల్లో పక్కనే ఉంటుంది. అయితే భార్యాభర్తలు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అని ఒకరికి ఒకరు భరోసా ఇచ్చుకోవాలి. కానీ నేటి రోజుల్లో మాత్రం భార్యాభర్తల బంధంలో అన్యోన్యత అనేది అసలు కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకి భార్యాభర్తలు బద్ద శత్రువులుగా మారిపోయి ఒకరిని ఒకరు దారుణంగా చంపుకోవడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల బంధం లోనే కాదు ఏ బంధంలో అయినా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు ఏ బంధం కూడా నిలబడలేదు. మరీ ముఖ్యంగా ఇద్దరి మధ్య అనుమానం అనే పెనుభూతం దూరింది అంటే చివరికి ఎన్నో అనర్ధాలు జరిగిపోతూ ఉంటాయి. ఇలా భాగస్వామి పై ఉన్న అనుమానమే చివరికి ప్రాణాలు తీసే పరిస్థితికి కారణమవుతూ ఉంటుంది. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాగే ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.


 భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరికి చంపేసాడు. తాళి కట్టినప్పుడు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చేసిన వాగ్దానాన్ని మరిచిపోయాడు. చివరికి అనుమానంతో కట్టుకున్న దాన్నే హత మార్చాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో శివలక్ష్మి, శివ మోహన్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తరచు గొడవ పడుతూ ఉండేవాడు. ఇటీవల ఆమెపై దాడి చేసి చంపేసాడు. తర్వాత జరిగిన విషయాన్ని కొడుకుకి తెలిపి అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే కొడుకు ఫిర్యాదుతో కేసు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: