ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల బంధం లోనే కాదు ఏ బంధంలో అయినా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేనప్పుడు ఏ బంధం కూడా నిలబడలేదు. మరీ ముఖ్యంగా ఇద్దరి మధ్య అనుమానం అనే పెనుభూతం దూరింది అంటే చివరికి ఎన్నో అనర్ధాలు జరిగిపోతూ ఉంటాయి. ఇలా భాగస్వామి పై ఉన్న అనుమానమే చివరికి ప్రాణాలు తీసే పరిస్థితికి కారణమవుతూ ఉంటుంది. ఇక ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇలాగే ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరికి చంపేసాడు. తాళి కట్టినప్పుడు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చేసిన వాగ్దానాన్ని మరిచిపోయాడు. చివరికి అనుమానంతో కట్టుకున్న దాన్నే హత మార్చాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో శివలక్ష్మి, శివ మోహన్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తరచు గొడవ పడుతూ ఉండేవాడు. ఇటీవల ఆమెపై దాడి చేసి చంపేసాడు. తర్వాత జరిగిన విషయాన్ని కొడుకుకి తెలిపి అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే కొడుకు ఫిర్యాదుతో కేసు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.