ఇప్పటివరకు నాటోలో సభ్యత్వ దేశాలు 31 ఉన్నాయని మనకు తెలుసు. త్వరలో జరగబోయే సమావేశంలో స్వీడన్ ని 32వ దేశంగా చేర్చుకోనున్నట్లుగా తెలుస్తుంది. అయితే నాటోలో ఉన్న, చేరనున్న మొత్తం  32 దేశాలలో ఇప్పుడు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కి రాసిన లేఖ ఒక కుదుపును తీసుకువచ్చిందని తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఆ లేఖ లో ఏమి వ్రాసాడు అంటే ఉక్రెయిన్ ను నాటో దేశాల సభ్యత్వంలో చేర్చుకుంటాను అంటేనే నేను యుద్ధం మొదలు పెట్టాను. అలా అన్న మీరే మంచి సమయంలో నన్ను వదిలిపెట్టడం సమంజసంగా ఉందా, రేపు మీకైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది కదా అంటూ ఒక భావోద్వేగ లేఖ వ్రాసినట్టుగా తెలుస్తుంది.


దీంతో నాటో సభ్యత్వ దేశాల్లోని 20దేశాలు వరకు ఇప్పుడు ఉక్రెయిన్ ను నాటో  సభ్యత్వం ఉన్న దేశాల్లో జాయిన్ చేసుకోవాలంటూ, మేము ఉక్రెయిన్ కు తోడు ఉన్నామంటూ వాళ్ల చైర్మన్ కు లేఖ కూడా వ్రాసాయి అని తెలుస్తుంది. స్టోలెన్ బర్గ్ రిటైర్ అవ్వబోతున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన ప్లేస్ లో ఎవరు వస్తారో ఇంకా తెలియలేదట. ఒక రకంగా ఇప్పుడు జెలెన్స్ కి వ్రాసిన ఈ లేఖ నాటో దేశాల సభ్యత్వ దేశాలలో ఒక చీలికను తెచ్చినట్లుగా తెలుస్తుంది.


ఇప్పుడు నాటో దేశాలలోని 11దేశాలు ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. అదేంటంటే నాటో సభ్యత్వంలో ఉన్న ఏ దేశమైనా సరే దాని అంతర్గత వ్యవహారాలు మాత్రమే తప్ప దేశ భద్రత విషయంలో నాటోలో లేని ఏ దేశంతో నైనా సరిహద్దు వివాదం వచ్చిందంటే నాటోలోని దేశాలన్నీ కలిసి రంగంలోకి దిగాలి. నాటో దేశాలన్నిటి నుండి సైనికులను పంపించాలి. ఇప్పటికే సెర్బియా దగ్గర జరుగుతున్న యుద్ధంలో లక్ష వరకు సైన్యాన్ని మోహరించాల్సి వస్తుంది అని తెలుస్తుంది. ఈ విధంగా 11దేశాలు ఉక్రెయిన్ కు షాక్ ఇస్తున్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: