బీజేపీ ప్రవచిత గుజరాత్ మోడల్ అంతా పైన పటారం లోన లొటారమేనని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారంతో ప్రజలను మోసగిస్తున్నారని కేసీఆర్ పదునైన విమర్శలు చేశారు. మతపరంగా ప్రజలను విభజించి క్షుద్ర రాజకీయంతో బీజేపీ దేశాన్ని ఏలాలనుకుంటోందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. దేశంలో వివిధ వర్గాల మధ్య ఉన్న సామరస్య వైఖరిని నాశనం చేయడం ద్వారా ఆప్ఘనిస్తాన్లా తయారు చేయాలనుకుంటున్నారా అంటూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ దేశానికి ఏం ఒరగబెట్టిందో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాము అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అమలు చేసే సాహసం చేయగలరా అంటూ కేసీఆర్ బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేశారు. బీజేపీ దళిత ద్రోహి అని, కేంద్రంలో ఉన్నది పేదల వ్యడతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ఆహార సబ్సిడీని భారీగా తగ్గించడాన్ని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్లో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని త్వరలో నిర్వహించనున్నామని దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు ఏం చేయాలనేది ఆ సమావేశంలో చర్చిస్తామన్నారు. దేశానికి కొత్త అజెండా కావాలని, ఈ దేశ యువత తమ భవిష్యత్తు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా తన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతున్నదో వచ్చే కొద్ది రోజుల్లో ఆయన స్పష్టం చేసే అవకాశం ఉంది.
బీజేపీ ప్రవచిత గుజరాత్ మోడల్ అంతా పైన పటారం లోన లొటారమేనని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారంతో ప్రజలను మోసగిస్తున్నారని కేసీఆర్ పదునైన విమర్శలు చేశారు. మతపరంగా ప్రజలను విభజించి క్షుద్ర రాజకీయంతో బీజేపీ దేశాన్ని ఏలాలనుకుంటోందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. దేశంలో వివిధ వర్గాల మధ్య ఉన్న సామరస్య వైఖరిని నాశనం చేయడం ద్వారా ఆప్ఘనిస్తాన్లా తయారు చేయాలనుకుంటున్నారా అంటూ మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ దేశానికి ఏం ఒరగబెట్టిందో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. తాము అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా అమలు చేసే సాహసం చేయగలరా అంటూ కేసీఆర్ బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేశారు. బీజేపీ దళిత ద్రోహి అని, కేంద్రంలో ఉన్నది పేదల వ్యడతిరేక ప్రభుత్వమని విమర్శించారు. ఆహార సబ్సిడీని భారీగా తగ్గించడాన్ని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్లో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని త్వరలో నిర్వహించనున్నామని దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు ఏం చేయాలనేది ఆ సమావేశంలో చర్చిస్తామన్నారు. దేశానికి కొత్త అజెండా కావాలని, ఈ దేశ యువత తమ భవిష్యత్తు కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా తన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతున్నదో వచ్చే కొద్ది రోజుల్లో ఆయన స్పష్టం చేసే అవకాశం ఉంది.