ఇక రాష్ట్రంలో మొత్తం 375 ఇంజనీరింగ్ , ఫార్మసీ కళాశాలలోని 1,50,837 సీట్లు కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి.ఇంకా ఈ సీట్లకు "All india Council of Technical Education" (AICTE) అనుమతి అనేది ఇచ్చింది. ఈ కాలేజీలను తనిఖీలు చేసి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయో, లేదో పరిశీలించాక ఆయా యూనివర్సిటీలు వాటికి అఫ్లియేషన్‌ ఇవ్వనున్నాయి. ఏపీ ఈఏపీసెట్‌-2022 తొలి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఆగస్టు 22 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 30 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపునకు గడువు ఉంది. 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కొనసాగనుంది. 28 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్‌ 3న ఆప్షన్లలో మార్పులకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్‌ 6న సీట్లు కేటాయించనున్నారు. ఈ ఏడాది మొత్తం 1,94,752 మంది విద్యార్థులు ఏపీఈఏపీ సెట్‌కు హాజరుకాగా మొత్తం 1,73,572 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరు https://sche.ap.gov.in/APSCHEHome.aspx ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు. ఆగస్టు 28 వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఆలోగా యూనివర్సిటీల అఫ్లియేషన్‌ను పూర్తి చేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు కూడా చేపట్టింది.


2022-23 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చిన ప్రకారం.. ఇంజనీరింగ్‌ లో మొత్తం 261 కాలేజీల్లో 1,42,877 సీట్లు ఉన్నాయి. వీటిలో 17 యూనివర్సిటీ కాలేజీల్లో 5 వేల సీట్లు ఉండగా.. 244 ప్రైవేటు కాలేజీల్లో 1,37,877 సీట్లున్నాయి.ఫార్మసీలో మొత్తం 71 కాలేజీల్లో 6,670 సీట్లున్నాయి. వీటిలో ఆరు యూనివర్సిటీ కాలేజీల్లో 400 సీట్లు, 65 ప్రైవేటు కాలేజీల్లో 6,270 సీట్లు ఉన్నాయి. ఇంకా అలాగే 43 ప్రైవేటు ఫార్మ్‌డీ కాలేజీల్లో 1,290 సీట్లు ఉన్నాయి.గత సంవత్సరం లాగానే 2022-23 విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో మొత్తం 35 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో ఈఏపీసెట్‌లో మెరిట్‌ విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ 35 శాతం కోటా కింద గతేడాది వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ విట్‌)లో 1,509 సీట్లు, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో 527 సీట్లు, బెస్ట్‌ వర్సిటీలో 1,074 సీట్లు, సెంచూరియన్‌ వర్సిటీలో 504 సీట్లు, క్రియా వర్సిటీలో 146 సీట్లు, సవితా వర్సిటీలో 81 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకులు పొందిన దాదాపు 3 వేల మంది ఈ వర్సిటీల్లో చేరారు. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతో చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: