ప్రాంతీయ పార్టీలో పార్టీ నాయకుడిదే అధికారం అంతా.. ఇదేమీ కొత్త కాదు.. ప్రాంతీయ పార్టీల్లో అధినాయకుడి కరుణ ఉన్నంత వరకే ఎవరికైనా రాజకీయ భవితవ్యం ఉంటుంది. అందుకే ప్రాంతీయ పార్టీల అధినేత ప్రాపకం కోసం నేతలు అర్రులు చాస్తుంటారు. నేతను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. ఆయన కరుణ ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదన్న రేంజ్‌లో ప్రవర్తిస్తుంటారు. అయితే.. ఈ ప్రవర్తన కొంత వరకూ బాగానే ఉంటుంది. కానీ.. మరీ శ్రుతి మించితే మరీ ఇంత బానిస మనస్తత్వమా అన్నట్టుగా తయారవుతుంది.


ఏపీ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఇలాగే జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు అక్కడే వేదికపై ఉన్న సీఎం, గవర్నర్‌లను మర్యాద పూర్వకంగా అభివాదం చేసి.. వేదిక దిగుతారు. అయితే.. ఈ నమస్కారం విషయంలో నిన్న చాలా మంది మంత్రులు అతి చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. మంత్రి అంటే.. మంత్రి వర్గ సభ్యుడు.. ముఖ్యమంత్రి అంటే.. మంత్రి వర్గంలో మొదటి వాడు.. మంత్రి వర్గ నాయకుడు.. మరోమాటలో చెపాలంటే.. ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రే.. మిగిలిన మంత్రులు ఆయన సహచరులు.


మరి అలాంటి హోదాలో ఉండి కూడా చాలా మంది మంత్రులు జగన్ పట్ల అపరిమితమైన భక్తి ప్రపత్తులు, భయం, గౌరవం చూపించారు. అంత పెద్ద వేదికపై ఆహుతులందరూ చూస్తుండగానే.. వేదికపై మోకాళ్లపై కూర్చుని మరీ ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించడం చూస్తే.. మరీ అంతగా సాగిలపడాలా.. ముఖ్యమంత్రి మెప్పు కోసం మరీ అంతగా పాకులాడాలా అనిపించక మానదు. కొత్త మంత్రులు అమర్నాథ రెడ్డి, జోగు రమేశ్ ఈ విధంగా ఏకంగా వేదికపైనే మోకాళ్లపై కూర్చుని మరీ జగన్‌కు పాదాభివందనం చేశారు.


ఇక నారాయణ స్వామి వంటి మరికొందరు సీనియర్లు కూడా తమ వయస్సు కూడా మరిచిపోయి జగన్‌కా పాదాభివందనం చేయడం విశేషం.. రోజా, తానేటి వనిత, మేరుగ నాగార్జున, విడదల రజిని.. ఇలా అందరూ జగన్ కాళ్లపై పడిపోయిన వారే. అమర్‌నాథ్ ప్రారంభించిన ఈ పాదాభివందనాల ప్రక్రియను తర్వాత వచ్చిన వారిలో చాలా మంది కొనసాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: