తెలంగాణలో ఉద్యోగాల జాతర సాగుతోంది. ఇప్పటికే అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇక ఇప్పుడు మరికొన్ని వేల ఉద్యోగాలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 2,391 పోస్టుల భర్తీకి కేసీఆర్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది. గురుకులాలు, సమాచార - పౌరసంబంధాల శాఖలో వివిధ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగార్థులకు మరో శుభవార్త అన్న ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తోందన్నారు.


బీసీ గురుకుల విద్యాలయాల్లో 1499 పోస్టులను గురుకులాల నియామక మండలి ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో 480 డిగ్రీ లెక్చరర్, 324 టీజీటీ, 235 పీజీటీ, 185 జూనియర్ లెక్చరర్, 60 ల్యాబ్ అసిస్టెంట్, 37 లైబ్రేరియన్, 33 ఆర్ట్-క్రాఫ్ట్-మ్యూజిక్ టీచర్, 30 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, 33 పీఈటీ, పది ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. మరో 63 స్టాఫ్ నర్స్ పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ నియామక మండలి ద్వారా భర్తీ చేస్తారు.  బీసీ గురుకుల విద్యాసంస్థల్లో గ్రూప్ 3, గ్రూప్ 4 కింద 12 చొప్పున జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 417 జూనియర్ లెక్చరర్ పోస్టులు గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.


గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 87 టీజీటీ, ఆరు ఆర్ట్-క్రాఫ్ట్-మ్యూజిక్ టీచర్ పోస్టులను  గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. సమాచార, పౌరసంబంధాల శాఖలో 166 పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అందులో నాలుగు పీఆర్వో, 16 ఏపీఆర్వో, 82 పబ్లిసిటీ అసిస్టెంట్, 41 అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, 22 ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తారు. ఇది నిజంగా తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: