అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు సోకదని కేవలం కోళ్ల ద్వారానే ఆ మహిళకు సోకిందని వివరాలు డబ్ల్యూహెచ్ వోకు తెలిపింది. ఇప్పటికే 200 మిలియన్ల కోళ్లను ప్రపంచ వ్యాప్తంగా చంపేశారని తెలుస్తోంది. ఒక్క జపాన్ లో 15 మిలియన్ల కోళ్లను చంపేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇది మనుషులకు సోకడం అనేది తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. బర్డ్ ప్లూ తో మనిషి చనిపోవడం మొదటి సారి కావడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే వుహన్ ల్యాబ్ లో కరోనా వైరస్ లీకై ప్రపంచం మొత్తం కొన్ని లక్షల మంది మరణాలకు కారణమయ్యారని చైనాపై నిందలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ ల్యాబ్ లోకి ఎవరినీ రానీయడం లేదు. ఎందుకంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయోనని చైనా ఒప్పుకోవడం లేదు.
ఇప్పుడు ఏకంగా బర్డ్ ప్లూతో మనిషి చనిపోవడం అనేది తీవ్రమైన విషయమే. బర్డ్ ప్లూ వచ్చిన కోళ్లను చంపేసే వారు. కానీ మనిషికి రావడం వల్ల ఇప్పుడు ఎలాంటి మందులు వాడాలి. దీనికి ఎటువంటి వైద్యం తీసుకోవాల్సిన అవసరముందనే వివరాలు ఎవరికీ తెలియదు. రాబోయే కాలంలో బర్డ్ ఫ్లూ ఎవరికీ రావొద్దనే కోరుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి