ఇలాంటి సమయంలో అప్గాన్ లో ఉన్న తెహ్రీక్ ఈ తాలిబాన్ సంస్థ పాక్ లో బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశామని ప్రకటించింది. అసలు బాలిస్టిక్ క్షిపణులు అంటే వార్ హెడ్లను మోసుకెళ్లేవి. బాలిస్టిక్ క్షిపణి ద్వారా అణ్వస్త్ర ఆయుధాలను మోసుకెళ్లి అనకున్న లక్ష్యంలో జారవిడవడం. ఆ ప్రాంతంలో ఎనలేని నష్టాన్ని కలిగించడం. కానీ బాలిస్టిక్ క్షిపణుల ద్వారా సాధారణ బాంబులతో కూడా దాడి చేయొచ్చు. ఇప్పుడు అప్గాన్ పాక్ పై చేసిన దాడి ఇలాంటిదే.
పాకిస్థాన్ మిలిటరీ ఉండే ఖైబర్ పంక్తువా ప్రాంతంలో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఖైబర్ పంక్తువాలో పాక్ మిలిటరీ అప్గానిస్తాన్ పై తాలిబాన్లపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తెహ్రీక్ ఈ తాలిబాన్ల సంస్థ ఏం చెప్పిందంటే అమెరికా ఇచ్చే డబ్బులతో తాలిబాన్లకు హనీ చేయాలని చూస్తే ఇలాంటి దాడులు తప్పవని హెచ్చరించింది. ఇంత దాడి చేశామని చెబుతున్నా ఇప్పటి వరకు పాకిస్థాన్ నోరు తెరవకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఒకప్పుడు తాలిబాన్లను పెంచి పోషించిన పాక్ కు ఇప్పుడు తగిన గుణపాఠం ఎదురవుతోంది. పాక్ లో ప్రతి రోజు ఏదో చోట విధ్వంసం చేయడానికి తెహ్రీక్ ఈ తాలిబాన్ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ వీరి దాడిని ఎలా తట్టుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి