ప్రభుత్వ విద్యను మెరుగుదల చేయడానికి వైఎస్ జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు సిద్దాంతం ప్రకారం.. మెరుగైన విద్యను  ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ద్వారా అందించాలన్నది. కానీ ప్రస్తుతం ఎల్ కేజీ చదువుకు దాదాపు రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ విద్యకైతే దాదాపు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు.


పేద విద్యార్థులు చదువుకోవడమంటే కేవలం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే చదవాల్సిన పరిస్థితి.  అయితే జగన్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మెరుగైన విద్యను అందించడానికి జగన్ 52 మంది  ప్రభుత్వ ఉపాధ్యాయులను  అమెరికా పంపిస్తున్నారు. వీరు అక్కడ విద్యా విధానం, ఇంగ్లీషు లో మెరుగైన బోధన నేర్చుకుని ఇక్కడి విద్యార్థులకు తెలియజేయడం.


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కాలేజీలు, విదేశీ విద్యలో మెరుగు పడాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావాలంటే, విదేశీ చదువులు చదివి గొప్పగా ఎదగాలంటే విద్యార్థులు చదువులో టాప్ లో ఉండాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలగాలి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఇంగ్లీషులో మాట్లాడటం అనేది ప్రతి గవర్నమెంట్ విద్యార్థికి రావాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రతి స్కూలులో ఇంగ్లీషు మీడియం తప్పనిసరి అని చేస్తున్నారు.


మాతృభాషలో చదువు ఎంత ముఖ్యమో ప్రస్తుత మారిన జీవన పరిస్థితుల్లో ఇంగ్లీషు భాషలో నైపుణ్యం అంత ముఖ్యం. ఆంగ్ల భాష నైపుణ్యం కేవలం కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అందరికీ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. మెరుగైన విద్య ప్రతి పేద వాడికి అందినపుడే ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతిఫలం దక్కుతుంది. పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయి ఇంగ్లీషు విద్యను నేర్చుకుని వారితో పోటీ పడి ఉద్యోగాలు సాధించే స్థాయికి చేరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: