చైనా అప్పులు ఇవ్వడం లేదు. గోధుమ పిండి కూడా దొరకడం లేదు. అరబ్ దేశాలు ఆదుకోవడం లేదని, అప్పులతో ఏం చేయాలో తోచని పరిస్థితి ఉందని దీని వల్ల ఈ సమయంలో పాకిస్థాన్ ఆక్రమితి కాశ్మీర్ పై దాడి చేసి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తామని దాన్ని మీరు అడ్డుకోవద్దని మోదీ బైడెన్ ను కోరినట్లు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
దీనికి భారత్ రష్యా నుంచి కాకుండా అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తుందని, పూర్తిగా అమెరికా సాయం తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చర్చలు జరిగినట్లు ఆరోపిస్తున్నారు. పాక్ కు ప్రస్తుతం యుద్ధం చేసేంత సామర్థ్యం లేదని ఇప్పుడు దాడి చేస్తే ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని మోదీ అమెరికా సాయం కోరడాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. కానీ బైడెన్, మోదీల సమావేశంలో ఈ విషయం చర్చకు రాలేదని తెలుస్తోంది.
ఇవన్నీ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పాకిస్థాన్ కు ప్రధాని కావాలని భావిస్తున్నారు. కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లోని కొంతమంది కూడా అదే జరిగితే బాగుండేది సరైన సమయం కదా అని ఇప్పుడు స్వాధీనం చేసుకుంటే మంచిదని అంటున్నారు. కానీ యుద్దంలోకి దిగితే అది ఎటువైపు వెళ్లి ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి భారత్ ఆచితూచి స్పందిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి