చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ప్రశ్నించలేదు. జగన్ సీఎం అయి నాలుగేళ్ల తర్వాత గట్టిగా ప్రశ్నించడం వల్ల ప్రస్తుతం రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. 100 నుంచి 40 శాతం రోడ్లు మాత్రమే బాగవుతున్నాయి. పవన్ కల్యాణ్ రోడ్ల గురించి చేస్తున్న ఉద్యమం మంచిదేననే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇదే విధంగా ప్రజల సమస్యలపై పోరాటం చేయడం కొనసాగించాలి. ప్రజలకు అవసరమైనవి ఏమిటో తెలుసుకోవాలి.
వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై పోరాటం చేయాలి. దానికి అందరి నుంచి మద్దతు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల విషయంలో పవన్ పోరాటం చేస్తున్నట్లే అన్ని సమస్యలపై పోరాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తద్వారా ప్రజల లోతుల్లోకి వెళ్లిపోతారు. జనసేన పార్టీకి మంచి గ్రాప్ వస్తుంది. జనసేనకు ప్రజల్లో నమ్మకం కలగాలంటే ఎలాంటి సీట్లు లేని ఈ సమయంలోనే పోరాటం చేయాలి. ప్రజల సమస్యల్ని తీర్చేందుకు ప్రయత్నం చేయాలి.
ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకునేలా జనసేన కార్యకర్తలకు సూచనలు ఇవ్వాలి. విద్య, వైద్యం, రోడ్లు మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, పరిశ్రమలు తదితర అన్ని విషయాల్లో క్లారిటీ పెంచుకోవాలి. అక్కడ జరగాల్సిన, జరుగుతున్న పనుల గురించి ప్రశ్నించాలి. ఏదీ అవసరమో తెలుసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇలా చేస్తే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ క్రెడిబిలిటీ పొంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అయినా గెలుచుకునే అవకాశం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి