కొంతమంది వ్యాపారస్థులు ఒక సమావేశంలో ప్రభుత్వం ప్రొపెషనల్ ట్యాక్స్ ఎక్కువ వేస్తోంది దాన్ని తొలగించాలని టీడీపీ యువ నేత లోకేశ్ ను అడిగారు.  దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ ప్రొపెషనల్ ట్యాక్స్ ను తీసేయాలని గతంలోనే శాసన మండలిలో  యనమల, నేను వాదించినట్లు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రొపెషనల్ ట్యాక్స్ విధానాన్ని తీసేస్తామని హామీ ఇచ్చారు.


జీతంతో పాటు ప్రొఫెషనల్ ట్యాక్స్ పెరుగుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఉద్యోగం చేస్తున్నందుకు సదరు సంస్థకు కట్టేది. ప్రైవేటులో ఉద్యోగం చేసే వాళ్లకు ఇది కట్ అవుతూ ఉంటుంది. ప్రైవేటు సంస్థలు ఉద్యోగం ఇచ్చిన సమయంలో ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తుంటాయి. ఇన్ కం టాక్స్ వేరే లా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నిబంధనలకు అనుగుణంగా ఇన్ కం ట్యాక్స్ ఉంటాయి. ఇలా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది.  రూ. 5 లక్షలకు మించి ఆదాయం పొందితే ఆపై కట్టాల్సిన ట్యాక్స్ ఒక రకంగా ఉంటుంది.


ప్రతి ప్రైవేటు సంస్థలో ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు. దాన్ని సాలరీ పే స్లిప్ లో చూపిస్తారు.  ప్రైవేటు సంస్థ యాజమాన్యాలు వాళ్ల అవసరం రీత్యా ఉద్యోగం ఇచ్చినందుకు ఆ సంస్థకు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఉద్యోగి నుంచి తీసుకుంటారు.  వ్యాపారస్థులకు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనే విధానం ఉంటుంది. దాన్ని ఏ రూపంలో ఎంత పర్సంటేజీలో వేస్తారనేది ఇంత వరకు చాలా మందికి తెలియదు.


మరి దానికున్న విధి విధానాలు ఏమిటి? దాని వల్ల వ్యాపారులకు గుర్తింపు వస్తుందా? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమిటి?  ఇలా  రాష్ట్రంలో పన్నులు, ఎలా వేటికీ వేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేనికి ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు. దేనికి అవసరం లేదు. ఎంత సాలరీ ఉంటే ట్యాక్స్ కట్టాలి. ఇలా ప్రతిదీ తెలియజేసే విధానం ఉంటే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: