ఆంధ్రప్రదేశ్ చెప్పిన సూచనలను కేంద్రం అమలు చేస్తుందని చెప్పినట్లు సాక్షి పత్రికలో కథనాలు వస్తున్నాయి. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి మంచి గుర్తింపు పొందినట్లు ఆంధ్రలో అమలవుతున్న పథకాలను కేంద్రం మెచ్చుకోవడమే కాకుండా వాటిని ఫాలో కావాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. కేంద్ర విద్యుత్ శాఖ ప్రవేశ పెడుతున్న పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకం. దేశ వ్యాప్తంగా ఇందన సామర్థ్యాలకు సంబంధించి ప్రోత్సహించేందుకు నూతన సాంకేతిక విధానాలను పెంపొందించే పరిశ్రమలకు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషీయన్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తుంది.


ఇందులో దాదాపు 12 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్  అజయ్ చెప్పారు. ఇందులో ఆరువేల కోట్లను కూడా విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేసే సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. 2023 లో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ చేసిన ప్రతిపాదనల ఆధారంగానే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు.


ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో నే ఆంధ్ర ప్రదేశ్అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. దేశంలో తొలి ఇన్వెస్ట్ మెంట్ బజార్ ను విశాఖ పట్నంలోనే నిర్వహించిన ఏపీ ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల్లో 430 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. ఏపీని ఆదర్శంగా తీసుకుని మొత్తం వివిధ రాష్ట్రాల్లో 2500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చినట్లు చెప్పారు.


ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో కేంద్ర పారిశ్రామిక రంగంలో వడ్డీ రాయితీ పథకానికి బీజం పోసిందన్నారు. అలాగే ఏపీ ఇంధన శాఖ  వడ్డీ రాయితీ కల్పించాలని కేంద్రానికి లేఖ రాసిందని సాక్షి తెలిపింది. మొత్తం మీద ఏపీలో ఇంధన శాఖ తీసుకున్నటు వంటి నిర్ణయంతో కేంద్రం కూడా వివిధ రాష్ట్రాలకు ఈ పథకం అమలు చేయనుంది. దీంతో చాలా పరిశ్రమలు వడ్డీ రాయితీ పొందనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: