
కిషన్రెడ్డి కాంగ్రెస్పై కూడా నిప్పులు చెరిగారు. పీవోకే సమస్య కాంగ్రెస్ నిర్వాకం వల్లే రావణ కాష్టంగా మారిందని ఆరోపించారు. పీవోకేను పాకిస్థాన్కు ఎవరు అప్పగించారని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాద దాడులకు సంతాపాలతో సరిపెట్టుకున్నారని విమర్శించారు. రాహుల్గాంధీకి ఈ జన్మలో ప్రధాని అయ్యే అవకాశం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం జాతీయ భద్రతపై గట్టి వైఖరి అవలంబిస్తోందని, పాకిస్థాన్లోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన ఘనత మోదీ సర్కారుదేనని గుర్తు చేశారు.
మోదీ ప్రభుత్వం ఉగ్రవాదంపై దృఢమైన చర్యలు తీసుకుంటోందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్కు నరకం చూపించిన విధానాన్ని ప్రపంచం గమనించిందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉగ్రవాద దాడులను నియంత్రించలేకపోయాయని, కేవలం ఖండనలతో సరిపెట్టాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశ భద్రతకు పెద్దపీట వేస్తూ, శత్రుదేశంపై నేరుగా దాడులు చేసి బలమైన సందేశం ఇచ్చిందని కొనియాడారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది. రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకత్వంపై కిషన్రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జాతీయ భద్రత, సైనిక విజయాలను రాజకీయీకరించే ప్రయత్నాలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని కిషన్రెడ్డి హెచ్చరించారు. ఈ విమర్శలకు కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు