గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ మార్పులు వంటి అంశాలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. కేసీఆర్ హాజరైతే ఈ విషయాలు మళ్లీ లేవనెత్తి సభను గందరగోళంగా మార్చవచ్చు. రాష్ట్రంలో నీటి సమస్యలు రైతుల ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హాజరు రాజకీయంగా కీలకమవుతుంది. కేసీఆర్ గతంలో సభకు రాకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడింది. ఇప్పుడు ఆయన హాజరు రాజకీయ డైనమిక్స్ మార్చవచ్చు.
ఇటీవల కేసీఆర్ సభకు హాజరైన సందర్భాలు చూస్తే గందరగోళం ఏర్పడలేదు. డిసెంబర్ 2025లో శీతాకాల సమావేశాలకు ఆయన హాజరైనప్పుడు కేవలం హాజరు రిజిస్టర్ సంతకం చేసి కొన్ని నిమిషాల్లోనే వెళ్లిపోయారు. మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళులు అర్పించకుండానే సభ నుంచి బయటకు వెళ్లడం విమర్శలకు దారితీసింది.
ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ సీటు వద్దకు వెళ్లి మాట్లాడడం సౌహార్దపూర్వకంగా సాగింది. అయితే నీటి వివాదాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి అంశాలు లేవనెత్తకపోవడం వల్ల గందరగోళం ఏర్పడలేదు. కేసీఆర్ పూర్తి సమావేశాలకు హాజరైతే మాత్రం వివాదాలు తీవ్రమవుతాయి. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపి ప్రశ్నలు సంధిస్తారు. రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలు లేవనెత్తి దాడి చేస్తుంది. ఈ పరిస్థితి సభను రచ్చరచ్చగా మార్చవచ్చు.కేసీఆర్ హాజరు రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతుంది.రాజకీయ విశ్లేషకులు ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీని మళ్లీ బలోపేతం చేస్తుందని అంచనా వేస్తున్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి