ఓ వీడియో, ఆహ్వాన పత్రికను రెడీ చేసి.. ఓ రేంజ్ సెటైర్ వేసింది. బడ్జెట్ పేరుతో ప్రజల చెవులకు పోగులు కుట్టించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు అంటూ సెటైర్ లు వేసింది. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో, ఓ వింత ఆహ్వాన పత్రికతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంట్రీ ఇచ్చారు. 'బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజలకు డీఎంకే ప్రభుత్వం చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహిస్తోంది' అని ఆరోపిస్తూ ఓ ఆహ్వాన పత్రికను తీసుకుని సభలోకి వచ్చారు ఎమ్మెల్యేలు. తేదీ: ఫిబ్రవరి 17, 2026, స్థలం : తమిళనాడు శాసనసభ, సమయం: ఉదయం 10 గంటల నుండి 'ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, చెవులు కుట్టే కార్యక్రమానికి ఆర్థిక మంత్రి తంగం తమరసు నాయకత్వం వహిస్తారని ఎద్దేవా చేసింది.
గత నాలుగున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందని, ఈ ఏడాది కూడా అలాగే ఘనంగా ఏర్పాటు చేసిందని ఆహ్వాన పత్రికలో పేర్కొంది. ఇక వీడియోలు అధికార డిఎంకే నేతలు ఓ పెద్ద సూది పట్టుకుని ప్రజలకు చెవులు కుట్టేందుకు వెళ్తూ ఉంటారు. వారిని చూసి ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటారు. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా వైరల్ అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి