చాలామంది గత 30 ఏళ్ల క్రితం డిగ్రీ చదివి.. వివిధ పరిస్థితుల కారణం గా నిర్ణీత గడువులోపు సబ్జెక్టులను  పాస్ కాలేక డిగ్రీ పట్టాను అందుకోలేకపోయారు. ఇక యూనివర్సిటీ ఇచ్చిన గడువు కాస్త పూర్తి అవడంతో డిగ్రీ క్యాన్సల్ అవుతుంది. దీంతో అలాంటి వారు మళ్ళీ డిగ్రీ పట్టా పొందాలంటే, నూతనంగా కొత్త అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటివారికి ఉస్మానియా యూనివర్సిటీ వారు ఒక శుభవార్త చెప్పారు.


యూనివర్సిటీ పరిధిలో గతంలో బ్యాక్ లాగ్స్ ఉండి, డిగ్రీ పట్టాను పొందలేకపోయిన విద్యార్థులకు మరొక  అవకాశం కల్పిస్తోంది.. "వన్ టైమ్ ఛాన్స్" కింద ఈ అవకాశాన్ని ఉస్మానియా కల్పిస్తోంది.. మరొకసారి రీ అడ్మిషన్ పొందకుండా గతంలో మిగిలిపోయిన సబ్జెక్ట్ లకు మాత్రమే ఫీజు చెల్లించి, పరీక్షలను రాసే అవకాశాన్ని యూనివర్సిటీ కల్పిస్తోంది..


గత 30 సంవత్సరాల క్రితం సబ్జెక్టు లు మిగిలిపోయి, డిగ్రీ పట్టా క్యాన్సల్ అయినవారికి కూడా పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ  ఉస్మానియా  యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.. ఇందుకోసం విద్యార్థులు అప్లై చేసుకోవడానికి మార్చి 15 వరకూ గడువు విధించారు. 2002-2012 మధ్య డిగ్రీ చదివి, బ్యాక్ లాగ్ లు ఉన్న విద్యార్థులు సబ్జెక్టు రూ. ఆరు వేల రూపాయలతో పాటు రెండు పేపర్ల వరకు అదనంగా  రూ.  710, మూడు పేపర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే రూ. 1010 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


1988 - 2002 మధ్య చదివిన విద్యార్థులు అయితే సబ్జెక్టుకు  రూ. 10,000 తోపాటు రూ. 200 రూపాయలు ఆలస్యం రుసుము తో పాటు, మార్చి 19 వరకు ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించింది యూనివర్సిటీ. ఇందుకు సంబంధించిన పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు  అధికారులు తెలిపారు.. అయితే వన్ టైం ఛాన్స్ కల్పించడంపై విద్యార్థుల నుంచి వర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, ఫీజులు అధికంగా అవ్వడాన్ని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై ఒక విద్యార్థి కోర్టును కూడా ఆశ్రయించినట్లు సమాచారం.  ఒకవేళ కోర్టు ఫీజు లను తగ్గించమని ఆదేశిస్తే, ఆ ఫీజు లను  విద్యార్థులకు తిరిగి ఇచ్చేస్తానని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: