కరోనా వైరస్ అన్నీ రంగాలతో పాటు విద్యారంగాన్ని కూడా కోలుకోలేని విధంగా పెద్ద దెబ్బ తీసింది. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇక వీళ్ల చదువు అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం hdfc బ్యాంక్ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. Covid Crisis Support పేరుతో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది.ఇక సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రారంభించినట్లు పేర్కొనడం జరిగింది.ఇక అర్హత విషయానికి వస్తే..ఇక ఈ స్కాలర్‌షిప్ ను పాఠశాల (1 నుంచి 12 తరగతుల వరకు) ఇంకా కాలేజీ (అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా) విద్యార్థుల కోసం రూపొందించడం జరిగింది. ఇక ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు 15 వేల రూపాయలు నుంచి 75 వేల రూపాయల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తారట.

ఇక ఈ స్కాలర్‌షిప్ ఫండ్‌ను ట్యూషన్ ఫీజు ఇంకా హాస్టల్ ఫీజు అలాగే ఆన్‌లైన్ లెర్నింగ్ పరికరాలు ఇంకా పుస్తకాల మొదలైన వాటి కొనుగోలుకు బాగా ఉపయోగించుకోవచ్చు.2020 వ సంవత్సరం జనవరి నుండి కరోనా మహమ్మారితో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలి. అయితే వారి కుటుంబ వార్షిక ఆదాయం మాత్రం సంవత్సరానికి రూ. 6 లక్షలకు మించకూడదు. ఇక దీనికి అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇక hdfc బ్యాంక్ ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను బడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తుందట. ఇక బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌ https://www.buddy4study.com/ లోకి వెళ్లి మీ ఈ–మెయిల్ ఇంకా మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. ఇక ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి అవసరమైన డాక్యుమెంట్స్ ఇందులో అప్‌లోడ్‌ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: