5g టెక్నాలజీ: ఇక ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ 5జీ టెక్నాలజీకి సంబంధించిన బిడ్డింగ్ అనేది ముగిసింది. మరికొద్ది నెలల్లో దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే.ఇక ఈ రంగంలోని 4 అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు విస్తరణకు వేగంగా అడుగులు కూడా వేస్తున్నాయి. ఇంకా రానున్న మూడు నెలల కాలంలో దీని ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ స్థితిలో బిడ్డింగ్ తరువాత టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు 5జీ టెక్నాలజీని అందించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నాయి.ఇక ఈ క్రమంలో 5g టెక్నాలజీని ప్రవేశపెట్టడం వల్ల, వచ్చే త్రైమాసికంలో దేశంలో దాదాపు 6 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని సమాచారం తెలుస్తోంది.ముఖ్యంగా ఆపరేటర్లు, సేల్స్‌మెన్, ఇంకా అలాగే కేబుల్ ఇన్‌స్టాలర్లకు అధిక డిమాండ్ ఉందని నివేదికలు చెబుతున్నాయి.2021లో టెలికాం కంపెనీలు డిసెంబర్ నెల నుంచి 5G టెక్నాలజీ కోసం అవసరమైన ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి.


ఇక గత సంవత్సరం అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల మధ్య 45%, జనవరి - మార్చి త్రైమాసికంలో 65%, ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 75% ఉద్యోగుల నియామకం అనేది జరిగింది.5జీ టెక్నాలజీ వల్ల 2023 ఆర్థిక సంవత్సరం నాటికి టెలికాం రంగంలో మొత్తం 18,000 నుంచి 20,000 ఉద్యోగాలు వస్తాయని పరిశ్రమ వర్గాల అంచనాలు చెబుతున్నాయి.ఇక ఈ నియామకాల్లో జోరు కొనసాగుతుందని వారు అంటున్నారు. ఇక ఈ 5g వేలం ముగియకముందే, రోల్ అవుట్ ప్లాన్‌లు అమలులోకి రాకముందు నుంచే టెలికాం కంపెనీలు తమ బ్రాడ్‌బ్యాండ్ కార్యకలాపాలను కూడా విస్తరించడం ప్రారంభించేశాయి. ఈ కారణంగా ఉద్యోగ అవకాశాలు అనేవి భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త టెక్నాలజీ రాక దేశంలోని నిరుద్యోగులకు మంచి వరంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: