పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య స్థాయుల్లో ప్రతిభను చాటుకున్న సుమారు ఆరువేల మంది విద్యార్థులు అక్టోబరు 15న విజయవాడలో పురస్కారాలు అందుకోనున్నారు. 2015-16 విద్యాసంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కుల్ని సాధించిన వారిని మండలాలు, సామాజిక వర్గాల వారీగా కలిపి 4003 మంది విద్యార్థులను ఎంపికచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాల నుంచి చక్కని మార్కుల్ని చేజిక్కించుకున్న 312, విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ, ఇంజినీరింగ్, తదితర కోర్సుల్లో అధిక మార్కుల్ని సాధించిన వారిలో 1126 మంది