దేశవ్యాప్తంగా ఉన్న సైనిక
పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతి (బాలురు)లో ప్రవేశాల కోసం నిర్వహించే అఖిల
భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2019-20కి గాను ప్రకటన విడుదలైంది...ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఐదు
,ఎనిమిది చదివే విద్యార్ధులు అర్హులు..
అర్హత: ప్రస్తుతం ఐదు, ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు అర్హులు.
వయసు: ఆరో తరగతి ప్రవేశాలకు 10-12 ఏళ్లు, తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 13-15 ఏళ్ల మధ్య ఉన్న
బాలురు అర్హులు.
ఎంపిక: రాత, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ, ఎస్టీలకు రూ.250.
దరఖాస్తులు: ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 8, 2018 నుంచి నవంబర్ 26,
2018 వరకు అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 1,
2018.
ప్రవేశ పరీక్షతేదీ: జనవరి 6, 2019.
వైద్య పరీక్షల నిర్వహణ
తేదీలు: 2019, ఫిబ్రవరి 11 నుంచి 28 వరకు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://sainikschooladmission.in