దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వచ్చి ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. గత ఆరు రోజులుగా ధరలు పెరుగుతూ వచ్చి ఈ రోజు ధరలు స్థిరమయ్యాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 పెరగడంతో ధర రూ.53,300కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.48,860 కి చేరింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర సెప్టెంబర్ 4-7వ తేదీ వరకూ స్వల్పంగా పెరిగింది. మళ్లీ ఈ రోజు ధర స్థిరంగా కొనసాగుతోంది.

దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,300, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,860కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,560కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,560 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.52,680, 22 క్యారెట్ల ధర రూ.48,310కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,010. 24 క్యారెట్ల ధర రూ.51,310 గా ఉంది.

దేశీయ మార్కెట్ లో పసిడి ధర స్థిరంగా ఉన్నా.. వెండి ధర మాత్రం పెరిగింది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.10 పెరగడంతో ధర రూ.68,010కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధర పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,320కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.49.810కు చేరింది. రాజధానిలో కూడా వెండి ధర స్వల్పంగా ఉంది. కేజీ వెండి ధర రూ.10 పెరగడంతో ధర రూ.68,010కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: