సమాజం లో ఆడపిల్లల పై జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం కొత్త చట్టాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.  మగవారితో సమానంగా ఆడవాళ్ళకు అన్నీట్లో హక్కులను కల్పించి వారికి కూడా సమాన హక్కుల వుండాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎన్ని కఠిన చట్టాలను అమలులోకి తీసుకువచ్చినా కూడా మహిళల పై దాడులు జరగడం మాత్రం ఎక్కడా ఆగలేదు. ముఖ్యంగా వరకట్న వేధింపులు ఇప్పటికీ జరుగుతునే ఉండటం బాధాకరం.


ఇప్పుడు ఒక బాధాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్ళైన నెలకే భర్త ఆమె పాలిట యమ పాశం అయ్యాడు. కట్నం డబ్బులు సరిపొలెదని చిత్ర హింసలు పెట్టాడు. అంతటితో అతని కోపం తగ్గలేదు.. భార్య ప్రైవేట్ భాగాలపై యాసిడ్ పోసి రాక్షస ఆనందం పొందాడు. అయ్యో పాపం అంటూ ఆ మహిళ పరిస్థితిని విన్న వాళ్లంతా కంటతడి పెడుతున్నారు. ఈ దారుణ ఘటన లుధియానాలో వెలుగు చూసింది.పెళ్లి అయిన నెల రోజులకే కట్నం డిమాండ్ చేశాడు ఓ యువకుడు. అంతే కాకుండా తన భార్య ప్రైవేట్ భాగాలపై యాసిడ్ పోశాడు. కొందరి సాయంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది.


ఆమెను వెంటనే ఆసుపత్రిలో చెర్పించారు. ఈ విషయం పై ఆమె సోదరుడు మాట్లాడుతూ.. పెళ్ళయిన ఐదు రోజులకే తన సొదరిని హింసలు పెట్టడం మొదలు పెట్టారు.అప్పటి నుంచి ఆమెను రోజు కోడుతున్నాడు. దాంతో ఆమె భయపడిన ఆమె అమ్మగారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ పెద్దలు సర్ది  చెప్పి మళ్ళీ ఆమెను తిరిగి పంపారు..బుధవారం అబ్బాయి తరపున వాళ్లు వచ్చి యువతిని వెంట తీసుకెళ్లారు. ఆమె అత్తమామల ఇంటికి చేరుకోగానే భర్త మళ్లీ కొట్టి శరీరంపై యాసిడ్ పోశాడని సోదరుడు ఆరోపించాడు..ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఎలాంటిదొ తెలిసాక వివరాలను తెలియజెస్తున్నాము అని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: