
దీంతో ఇటీవల కాలంలో దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు కిటికీలు తలుపుల దగ్గర దోమతెరలు పెట్టుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరు. అయితే దోమల గురించి దాదాపు అందరి లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోమలు పగబట్టి నట్టుగా కొంతమంది వ్యక్తులనే ఎక్కువగా ఎందుకు కుడతాయి.. ఇక ఇన్ని జీవరాసులు ఉండగా ఎక్కువగా మనుషుల రక్తం ఎందుకు పిలుస్తాయ్ అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. అయితే బాగా బ్రైట్ గా ఉండే బట్టలు వేసుకున్న వారిని తొందరగా గమనించి దోమలు కుడతాయ్ అన్న విషయాన్ని అప్పట్లో ఒక అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
కేవలం మనుషులనే ఎందుకు దోమలు ఎందుకు కుడతాయి అన్న విషయంపై కూడా ఒక సరికొత్త అధ్యాయం చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో మనిషి రక్తాన్ని దోమలు ఎందుకు ఇష్టంగా తాగుతాయ్ అన్న విషయం వెల్లడైంది. మనిషి వాసనా దోమలకు నారింజ పుల్లటి వాసనగా అనిపిస్తుందట. అందుకే ఆ వాసన రాగానే మనిషి ఎక్కడున్న పసిగట్టి వచ్చి రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయట. ఇక ఇతర జంతువులలో అలాంటి వాసన రాకపోవడంతో జంతువుల జోలికి పోకుండా ఉంటాయట దోమలు..