చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..

2008 వ సంవత్సరంలో బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించడం జరిగింది.అలాగే వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.

2010 వ సంవత్సరం విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు అనేవి జరిగాయి.

2013 వ సంవత్సరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..

1926 వ సంవత్సరంలో ఎక్కిరాల కృష్ణమాచార్య అనే రచయిత ఇంకా హోమియో వైద్యుడు జన్మించారు.

1949 వ సంవత్సరంలో దువ్వూరి సుబ్బారావు జన్మించారు. ఈయన ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కూడా ఈయన పనిచేశాడు.

ఇక 1950 వ సంవత్సరంలో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జన్మించారు. ఈయన కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు అలాగే నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు కూడా.

అలాగే చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..

1908 వ సంవత్సరంలో ఖుదీరాం బోస్ మరణించారు. ఈయన భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు.

1946 వ సంవత్సరంలో బత్తిని మొగిలయ్య గౌడ్ మరణించారు. ఈయన తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు ఇంకా వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు.

1962 వ సంవత్సరంలో పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి మరణించారు. ఈయన ప్రముఖ రచయిత ఇంకా సాహితీకారుడు.

2000 వ సంవత్సరంలో పైడి జైరాజ్ మరణించారు. ఈయన భారత సినీరంగంలో నటుడు ఇంకా నిర్మాత అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

2012 వ సంవత్సరంలో భద్రిరాజు కృష్ణమూర్తి మరణించారు. ఈయన ద్రావిడ భాషా పరిశోధకుడు ఇంకా భాషాశాస్త్ర అధ్యాపకుడు.

2016 వ సంవత్సరంలో యాదాటి కాశీపతి మరణించారు. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు ఇంకా రచయిత.ఇక ఇదే సంవత్సరంలో ఇచ్ఛాపురపు రామచంద్రం మరణించారు. ఈయనో కథారచయిత ఇంకా బాల సాహిత్య రచయిత.

2018 వ సంవత్సరంలో విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ మరణించారు. ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి ఇంకా సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత.

మరింత సమాచారం తెలుసుకోండి: