దోమలను అరికట్టడానికి చాలా మంది కూడా తమ ఇళ్లల్లో మస్కిటో కాయిల్స్, రిఫిల్స్ ఇంకా అలాగే స్ప్రేలను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వీటి తయారీలో కెమికల్స్  అనేవి ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల జలుబు, ఆయాసం, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎటువంటి కెమికల్స్ వాడడకుండా దోమల సమస్య నుండి ఈజీగా బయటపడేసే ఒక మంచి టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దోమలను అరికట్టడంలో వెల్లుల్లి రెబ్బలు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక దీని కోసం ముందుగా 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 4 కర్పూరం బిళ్లలను బాగా పొడిగా చేసి వేసుకోవాలి. చివరగా ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి కలపాలి. ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్రమిదలో వేసుకోవాలి. ఆ తరువాత దీనిపై ఒక వత్తిని ఉంచి సాయంత్రం పూట చీకటి పడుతున్న సమయంలో ఇంటి తలుపులన్నీ కూడా మూసేసి వెలిగించాలి.


ఇక ఇలా తయారు చేసుకున్న దీపం 20 నుండి 25 నిమిషాల పాటు బాగా వెలుగుతుంది.ఇక ఈ దీపం నుండి వచ్చే పొగ కారణంగా గదిలో ఉండే దోమలు అన్నీ కూడా బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది.సాయంత్రం పూట దీనిని ఒక్కసారి వెలిగిస్తే రాత్రంతా కూడా సహజ సిద్దమైన దోమల నాశినిగా పని చేస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇలా వెలిగించిన దీపం మనకు మంచి ఎయిర్ ఫ్యూరీ ఫైయర్ గా కూడా పని చేస్తుంది. దీన్ని వాడడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ టిప్ పాటించడంతో పాటు పరిసరాలను కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి తలుపులకు ఇంకా అలాగే కిటికీలకు ఖచ్చితంగా తెరలను అమర్చుకోవాలి. రాత్రి పూట ఖచ్చితంగా దోమ తెరలను ఉపయోగించాలి.ఇంకా అలాగే పెరట్లో దోమలు ఎక్కువగా ఉన్న చోట కాఫీ గింజలను పొడిగా చేసుకొని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల  దోమల సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఈ టిప్స్ పాటించడం వల్ల దోమల సమస్య చాలా ఈజీగా తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: