మంచి పోషకాహారం కలిగిన ఆహారం తీసుకుంటే నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. సాధారణంగా నరాల బలహీనత రాగానే చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇది వాడటం వల్ల శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజ సిద్దంగా తయారు చేసిన ఆహార పదార్థాలతో నరాల బలహీనత సమస్యని తరిమికొట్టవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 గ్రాముల వాల్ నట్స్, 10 గ్రాముల దాల్చిన చెక్క, 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల అవిసె గింజలు వేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిలువ చేసుకొని ప్రతిరోజు అర టేబుల్ స్పూన్స్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగాలి.
ఇకపోతే ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ శరీరానికి కావలసిన ఎనర్జీ లభించడమే కాదు అలసట లేకుండా ఉంటుంది. అంతేకాదు నరాల సమస్య దూరం అయిపోయి.. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఈ పొడి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక ఉదయం లేదా రాత్రి సమయంలో తాగితే సరిపోతుంది. ఇక ఇలా కొద్ది రోజులపాటు తాగితే నరాల బలహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.