![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/lifestyle/taurus_taurus/social-media6f27983b-77be-4b45-9cc7-4bed07e2b3c5-415x250.jpg)
ప్రస్తుతం చీమ చిటుక్కుమన్నా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయాల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి.. రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి సోషల్ మీడియాలో మన దిన చర్య పోస్టు చేయకుండా నిద్ర పోయే వాళ్లు వందలో ఒకరో ఇద్దరో ఉంటారు. గంటల తరబడి రీల్స్, ఫేస్ బుక్ లో పోస్టులు, వాటిని చదవడం.. లైక్ లు కొట్టడం మనకి కావాల్సిన కంటెంట్ వెతకడం లాంటివి పొద్దెరెగకుండా చేస్తున్నాం.
అయితే మనం పెట్టే కామెంట్లు, చూసే వీడియోలు మనకిందికే నీళ్లు తెస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్న ప్రతి వ్యక్తి మీద సోషల్ మీడియ ఆల్గారిథం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇది మన మీద పెత్తనం చెలాయిస్తోంది. అత్యధికంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాలంలో గడుపుతున్న వ్యక్తుల భద్రతకు భంగం కలిగిస్తోంది. దీని మూలంగానే సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. సైబర్ మోసగాళ్లకు సోషల్ మీడియా ఆల్గారిథం సహాయకారిగా పని చేస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు అయిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం, యూ ట్యూబ్ వంటివి వ్యక్తిగత గోప్యతను హరిస్తున్నాయి. ఈ లింక్ డీల్ ల పనితీరు వెనుక సెర్చ్ ఇంజిన్ కు అనుసంధానం గా ఉండే ఆల్గారిథం మ్యాపింగ్ అనేక అనర్థాలకు దారి తీస్తోంది. మనం కొట్టే లైకులు, చూసే వీడియోలు, పెట్టే కామెంట్లు మన మానసిక స్థితిని, మన ఉద్యోగ, ఆర్థిక అవసరాలను తెలియజేస్తాయి. వీటికి అనుగుణంగా మనకు సంబంధిత పోస్టులు, వీడియోలు వస్తుంటాయి. వీటిని సొమ్ము చేసుకొని మోసగాళ్లు రెచ్చిపోతుంటారు. మనకి ఫేక్ జాబ్ లు, తక్కువ సమయలో అధిక పెట్టుబడులు, క్రెడిట్ కార్డులు వంటి మోసాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా యూజర్లు తస్మాత్ జాగ్రత్త.