జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ రేట్లపై కొంతమేర విమర్శలు వినిపిస్తున్నా పవన్ ఫ్యాన్స్ మాత్రం ప్రీమియర్ షో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయల భారీ టార్గెట్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఈ టార్గెట్ మరీ భారీ టార్గెట్ కాదు.

ఈ మొత్తంలో 100 కోట్ల రూపాయల బిజినెస్ తెలుగు రాష్ట్రాల నుంచే  జరిగింది.  నైజాం ఏరియాలో మైత్రి నిర్మాతలు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు లభించడం  ఈ  సినిమాకు ప్లస్ అవుతోంది. మెజారిటీ ఏరియాలలో అడ్వాన్స్ బేసిస్ పై నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో పాజిటివ్ టాక్ ఈ సినిమాకు కీలకం కానుందని చెప్పవచ్చు.

సుదీర్ఘ కాలం పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో బిజినెస్ జరగలేదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో  వాయిదా పడటం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. అయితే థియేట్రికల్ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు  క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని ప్రచారం జరగడం కూడా ఈ సినిమా   బిజినెస్ కు ప్లస్ అయింది.

క్రిటిక్స్ నుంచి ఏ మాత్రం  పాజిటివ్ టాక్ వచ్చినా రెండు వారాల పాటు వీరమల్లు దూకుడుకు  బ్రేకులు వెయ్యలేము. ఈ సినిమా ఫలితం ఆధారంగా కింగ్డమ్ సినిమాకు బిజినెస్ జరగనుందని తెలుస్తోంది.  పవన్ నుంచి సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు ఫస్ట్ డే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండాలని ఫ్యాన్స్, విశ్లేషకులు భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: