అధికార వైసీపీలో ఈ ఏడాది కాలంలో బాగా ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఒకరు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మావతికి నియోజకవర్గంలో మంచి క్రేజ్ వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుషన్ చేసిన పద్మావతి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున శింగనమల నుంచి పోటీ చేసి 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఓటమి పాలైన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వచ్చారు. సాగునీటి  సాధనకు నియోజకవర్గంలో పాదయాత్ర, పింఛన్‌దారులకు న్యాయం చేయాలని తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు చేశారు.

 

ఈ పోరాటాల ఫలితంగా 2019 ఎన్నికల్లో పద్మావతికి భారీ విజయం దక్కింది. టీడీపీ అభ్యర్ధి బండారు శ్రావణిపై 46 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రావణి తనదైన శైలిలో నియోజకవర్గంలో పనిచేసుకుని వెళుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదొక గ్రామంలో పర్యటిస్తూ ప్రజలని పలకరిస్తున్నారు. పార్టీల పరంగా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు.

 

ఇక కొత్తగా సి‌సి రోడ్లు, డ్రైనేజ్, సచివాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యంగా నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందించారు. అయితే నియోజకవర్గంలో పద్మావతి క్రేజ్ ఎలా పెరుగుతుందో, టీడీపీ అభ్యర్ధి శ్రావణి క్రేజ్ కూడా అలాగే పెరుగుతుంది. ఆమె దారుణంగా ఓడిపోయినా సరే ప్రజలకు అండగానే ఉంటున్నారు.

 

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటం చేస్తున్నారు. అటు కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. కాకపోతే ఎన్నికలై ఏడాది దాటిన కూడా నియోజకవర్గంలో పద్మావతి బలం పెద్దగా తగ్గినట్లు కనిపించడం లేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ వైపే శింగనమల ప్రజలు నిలబడే అవకాశముంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: