టీడీపీ అభ్యర్ధి కురుగొండ్ల రామకృష్ణపై 38 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే సీనియర్ నేత కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆనం ఆశించారు. కానీ జగన్ నెల్లూరులో మంత్రి పదవి అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చారు. ఇక వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు...నియోజకవర్గంలో పనులు చేసుకోవడానికి అధికారులు సహకరించడం లేదని పలుమార్లు...బహిరంగంగానే విమర్శలు చేశారు.
అలాగే జిల్లాలో జూనియర్ నేతల చేతుల్లో పెత్తనం ఉందని ఆనం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొన్న ఆ మధ్య ఆనం మంత్రి అనిల్పైనే డైరక్ట్గా విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. అనిల్ సొంత జిల్లాలోనే నీటిపారుదలకి సంబంధించిన వందల కోట్ల టెండర్లుకి అగ్రిమెంట్లే జరగలేదని, అధికార పార్టీవారు అడిగే కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు పరారయ్యారని, నెల్లూరు సిటీ, రూరల్లో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మాట్లాడారు.
అయితే ఇలా బహిరంగంగా పార్టీకి సంబంధించిన నేతలపై ఆనం విమర్శలు చేయడంతో, వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు వార్తలు ఇచ్చాయి. కానీ ఏమైందో తెలియదు గానీ, కొన్నిరోజుల నుంచి ఆనం ఏపీ పోలిటికల్ స్క్రీన్పై కనిపించడం లేదు. ఇక ఆయన నియోజకవర్గ పరంగా పనులు కూడా బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పథకాలు వైసీపీకి ప్లస్. ఇక్కడ పార్టీ పరంగా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదు.
అలాగే టీడీపీ నేత కురుగొండ్ల రామకృష్ణ కాస్త పుంజుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో యాక్టివ్ గానే పనిచేసుకుంటున్నారు. కానీ వైసీపీ బలంగా ఉండటం వల్ల, టీడీపీ పుంజుకోలేకపోతుంది.