గతంలో నెలకు ఒకరు చొప్పున టాలీవుడ్ సెలెబ్రెటీలు వరస మరణాలు పొందడంతో  టాలీవుడ్ కు ఏమైందీ అంటూ ఏకంగా ఫిలిం నగర్ దేవస్థానంలో ఇండస్ట్రీలోని నటీనటుల ఆరోగ్యం కోసం హోమాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటనల  నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకున్న తరువాత ఇప్పుడు మళ్ళీ మన ఇండస్ట్రీ యంగ్ హీరోలకు మళ్ళీ శాపం తగిలిందా అంటూ మాటలు వినిపిస్తున్నాయి. 

కేవలం రెండు నెలల వ్యవధిలో ఇండస్ట్రీకి సంబంధించి సుమారు ఆరుగురు హీరోలకు వరస పెట్టి గాయాలు కావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘ఆర్ ఆర్ ఆర్’ నటిస్తున్న చరణ్ కు కాలికి గాయమై అతడు కోలుకునే లోపే జూనియర్ చేతికి గాయం అవ్వడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ షెడ్యూల్ కు భారీ బ్రేక్ పడింది. ఈమధ్యనే నానికి కూడ గాయం అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు వారంతా తమ గాయాల నుండి తేరుకున్న తరువాత కేవలం రెండురోజుల వ్యవధిలో వరసగా నాగ శౌర్య – సందీప్ కిషన్ – ఈరోజు శర్వానంద్ గాయాల బాట పడటంతో యంగ్  హీరోలకు పెద్ద శాపమేదో తగిలింది అంటూ మళ్ళీ ఒక సెంటిమెంట్ పుట్టుకు వచ్చింది. ఈమధ్యనే వరుణ్ తేజ్ ఒక భారీ కారు ప్రమాదం నుండి గాయాల బాట పడకుండా అదృష్టం కొద్దీ బయట పడ్డాడు.
 
నడుస్తున్న పరిణామాలతో టాలీవుడ్ కు బ్యాడ్ టైం రన్ అవుతోంది అంటూ కొందరు ఈ ప్రమాదాలను తప్పించుకోవడానికి ఏమైనా హోమాలు చేయాలా అంటూ అప్పుడే ఇండస్ట్రీ ప్రముఖులు కొందరు జ్యోతిష్కులను సంప్రదిస్తున్నట్లు టాక్.  ఒకవైపు విడుదల అవుతున్న సినిమాలలో 90 శాతం వరకు ఫ్లాప్ అయి కలక్షన్స్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థుతులలో ఇప్పుడు హీరోలకు వరసపెట్టి జరుగుతున్న ప్రమాదాలు వల్ల ఆ హీరోలతో సినిమాలు తీస్తున్న చాలామంది నిర్మాతలకు ఆసినిమాల నిర్మాణం ఆలస్యం అవ్వడం వల్ల భారీగా నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: