వరుస పరాజయాల తో డీలా పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ కు 'చిత్ర లహరి' కొత్త జోష్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకోవడంతో ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు ఈ హీరో. ప్రస్తుతం సాయి ధరమ్, మారుతీ డైరెక్షన్ లో 'ప్రతి రోజు పండగే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా కాకుండా తేజూ మరో మూడు సినిమాలకు సైన్ చేశాడట. అందులో భాగంగా 'ఉయ్యాలా జంపాల' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినా సుబ్బు తో ఓ సినిమా కు కమిట్ అయ్యాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాతో పాటు 'రగడ' ఫేమ్ వీరు పోట్ల డైరెక్షన్ లో కూడా ఓ సినిమా కు ఓకే చెప్పాడు.
ఇక ఇవి గాక ఇప్పుడు సాయి ధరమ్ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేయనున్నాడని సమాచారం. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కోలీవుడ్ లో తల అజిత్ తో 'మంకత' అనే చిత్రాన్ని తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకట్ ప్రభు. ఇటీవల చెన్నై లో వెంకట్ ప్రభు,అనిల్ సుంకర కు కథ వినిపించాడు. ఆయన చెప్పిన కథనచ్చడంతో వెంటనే ఆ స్టోరీని సాయి ధరమ్ కు చేరవేశాడు. సాయి ధరమ్ కూడా కథ నచ్చడంతో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రతి రోజు పండగే తరువాత ఈసినిమానే సెట్స్ మీదకు వెళ్లేలా కనిపిస్తుంది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.