బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కథానాయికగా నటించిన చిత్రం ‘బాలా’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మా్న్ ఖురానా ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఆయుష్మాన్‌ బట్టతలతో బాధపడే యువకుడి పాత్రను పోషించింది. భూమి పెడ్నేకర్ నల్లగా కనిపించే అమ్మాయిగా నటించింది. అయితే సినిమాలో భూమి నల్లగా కనిపించాలని ఆమె ముఖం నిండా మేకప్ వేసి అసహ్యంగా తయారుచేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో బిపాసా బసు, ప్రియాంక చోప్రా లాంటి డస్కీ బ్యూటీలు ఉన్నప్పడు తెల్లగా ఉన్న హీరోయిన్‌ను నల్లగా మార్చడమేంటని ప్రశ్నిస్తు్న్నారు.


ఇలాంటి హిపోక్రసీ నుంచి బాలీవుడ్ ఎప్పుడు బాగుపడుతందోనని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు అలా ప్రశ్నించడంలో ఓ అర్థముంది. బాలీవుడ్‌లో ఎందరో డస్కీ బ్యూటీలు ఉన్నారు. వారందరినీ వదిలేసి కాస్త తెల్లగా ఉన్న భూమికి రంగు అద్ది నల్లగా మార్చడం కరెక్ట్ కాదు. ఇలాంటి పాత్రల కోసమైనా కొత్తవారిని తీసుకుని యంగ్ ట్యాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే బాగుండేది. ఈ సినిమా అనే కాదు.. తాప్సి, భూమి పెడ్నేకర్ కలిసి నటించిన ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమాలోనూ 30 ఏళ్ల వయసున్న యువతులను 70 ఏళ్ల వారిగా మార్చి చూపించడం వివాదాస్పదమైంది. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో తమన్నా పాత్ర కూడా ఇలాగే ఉంటుంది. ఇందులో ఆమె లక్ష్మి అనే నర్తకి పాత్రలో నటించారు.


తమన్నా చాలా తెల్లగా ఉంటారు. కానీ ఆమెకు మేకప్ వేసి సినిమా కోసం డస్కీగా తయారుచేశారు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఇలాంటి వివాదాలు ఏమీ ఎదురుకాలేదు. కానీ బాలా సినిమాలో భూమి పెడ్నేకర్‌ను చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇంకెప్పుడు బాగుపడుతుంది? అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. బాలీవుడ్‌లో ఎందరో డస్కీ బ్యూటీలు ఉన్నప్పటికీ సినిమాలో స్టార్ నటిని ఎంపిక చేసుకోకపోతే సినిమా ఆడదన్న భయం కూడా సినిమా టీంకి ఉండొచ్చు.


నెటిజన్లు అంటున్నట్లు ప్రియాంక చోప్రా, బిపాసా బసులను ఎంపికచేసుకోవాలంటే వారు పెద్ద స్టార్స్ కాబట్టి సినిమాలో హీరోకి సమానమైన పాత్ర ఇవ్వాలి. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఇవ్వాలి. అంత రిస్క్ ఎందుకని కాస్త ప్రేక్షకులకు పరిచయం ఉన్న భూమి పెడ్నేకర్‌ను సినిమాలో తీసుకున్నట్లున్నారు. మరి నెటిజన్ల అభిప్రాయంపై బాలా సినిమా టీం ఏమంటారో వేచి చూడాలి.

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కథానాయికగా నటించిన చిత్రం ‘బాలా’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మా్న్ ఖురానా ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఆయుష్మాన్‌ బట్టతలతో బాధపడే యువకుడి పాత్రను పోషించింది. భూమి పెడ్నేకర్ నల్లగా కనిపించే అమ్మాయిగా నటించింది. అయితే సినిమాలో భూమి నల్లగా కనిపించాలని ఆమె ముఖం నిండా మేకప్ వేసి అసహ్యంగా తయారుచేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో బిపాసా బసు, ప్రియాంక చోప్రా లాంటి డస్కీ బ్యూటీలు ఉన్నప్పడు తెల్లగా ఉన్న హీరోయిన్‌ను నల్లగా మార్చడమేంటని ప్రశ్నిస్తు్న్నారు.
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కథానాయికగా నటించిన చిత్రం ‘బాలా’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మా్న్ ఖురానా ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో ఆయుష్మాన్‌ బట్టతలతో బాధపడే యువకుడి పాత్రను పోషించింది. భూమి పెడ్నేకర్ నల్లగా కనిపించే అమ్మాయిగా నటించింది. అయితే సినిమాలో భూమి నల్లగా కనిపించాలని ఆమె ముఖం నిండా మేకప్ వేసి అసహ్యంగా తయారుచేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో బిపాసా బసు, ప్రియాంక చోప్రా లాంటి డస్కీ బ్యూటీలు ఉన్నప్పడు తెల్లగా ఉన్న హీరోయిన్‌ను నల్లగా మార్చడమేంటని ప్రశ్నిస్తు్న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: