హ్యాపిడేస్ తో కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్దార్థ్ ఆ తర్వాత స్వామీ రా రా, కార్తికేయ, కేశవ, అర్జున్ సురవరం లాంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి మార్కెట్ ని పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా పెళ్ళి చేసుకొని ఒక ఇంటివాడైయ్యాడు ఈ కుర్ర హీరో. ఇలా పెళ్ళి చేసుకున్నాడో లేదో అలా తన కొత్త సినిమా అప్‌డేట్ తో ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా "కార్తికేయ – 2 " సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ ఇచ్చాడు. ఈ సినిమా కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చందు మొండేటి నిఖిల్ సెన్షేషనల్ హిట్ ని దక్కించుకున్నారు. అప్పటి నుంచే ఈ సినిమాకి సీక్వెల్ ని తీయాలని ఈ ఇద్దరు ప్లాన్ చేసినప్పటికి అది ఇన్నాళ్ళకి కార్యరూపం దాల్చింది.

 

అయితే తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని రూ.25 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించనున్నారని తెలుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్, భారీగా విఎఫ్ఎక్స్ వర్క్ ఉండటంతో ఈ సినిమాకి అంత బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. అయితే ఇది అంత పెద్ద బడ్జెట్ కాదు మినిమం బడ్జెట్ తోనే పక్కా ప్లాన్స్ తోనే నిర్మించనున్నారని అంటున్నారు.

 

ఇక ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు హిస్టారికల్ కాస్పెక్ట్ బాగా హైలెట్ గా నిలవనున్నాయట. అంతేకాదు ఈ సినిమాలో కూడా ఎంటర్ టైన్మెంట్ కి ఏమాత్రం లోటుందడని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాని రూపొందించనున్నారని సమాచారం. ఇక ‘కార్తికేయ’ సినిమాకి ‘కార్తికేయ 2’ సీక్వెల్ గా రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అంచనాలు బాగా ఉన్నాయి.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: