మహానటి సినిమా తర్వాత బయోపిక్ లకు మంచి డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. మంచి కథ ఉంటే సినిమా చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా మంచి కథలు ఉంటే పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరూ కూడా ఇప్పుడు బయోపిక్ ల విషయంలో కాస్త దూకుడు గానే ఉన్నా సరే వాళ్లకు మంచి కథలు దొరికే పరిస్థితి మాత్రం టాలీవుడ్ లో లేదనే చెప్పాలి. ఈ తరుణంలో ఒక బయోపిక్ గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.


మాజీ హీరోయిన్ ,నిర్మాత, దర్శకురాలు అయిన విజయ నిర్మల జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను ఆమె కుమారుడు నరేష్ నిర్మించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి నరేష్ కొంత మంది దర్శకులతో కూడా చర్చలు జరిపారని, అయితే కథ విషయంలో మాత్రం స్పష్టత రాక ఆగిపోయారని తెలుస్తోంది. ఈ తరుణంలో విజయ నిర్మల బయోపిక్ కి సంబంధించి నాగ్ అశ్విన్ ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.


మహానటి సావిత్రి జీవితాన్ని చాలా అందం గా చూపించిన నాగ్ అశ్విన్ అయితే ఈ కథను ముందుకు తీసుకు వెళ్తారని ఆయన వద్ద సమర్ధత ఎక్కువగా ఉంది కాబట్టి  ఆయనతోనే చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతను వచ్చే ఏడాది చివరి వరకు దాదాపు ఖాళీ గానే ఉంటున్నాడు. వచ్చే ఏడాది చివర్లో ప్రభాస్ తో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఈ లోపు విజయ నిర్మల బయోపిక్ ని పూర్తి చేయించి విడుదల చేయించాలని ఆమె కుమారుడు నరేష్ భావిస్తున్నట్టు టాక్. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: