సమంతా గత ఏడాది మూడు సినిమాలు చేసింది. ఓ బేబీ, మజిలీ, జాను సినిమాలు చేయగా అందులో జాను సినిమా డిజాస్టర్ అయింది. మిగతా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. అయితే మరి జాను ఎఫెక్టో మరేమిటో కానీ ఆమె ఆ తర్వాత ఏకంగా ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుంది. ఆమె మరో సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. అయితే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ మాత్రమే ఆమె చేసింది. అందుకు సంబందించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తూ వస్తోంది. నిజానికి లాక్ డౌన్ కు ముందే సమంతా ఎన్నో కథలు విన్నప్పటికీ ఏదీ ఆమె ఓకే చేయ లేదు.

అయితే ఆమె తాప్సితో గేమ్ ఓవర్ అనే సినిమా చేసి హిట్ కొట్టిన అశ్విన్ శరవణన్ చెప్పిన పాయింట్ నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మరికొద్దిరోజుల్లో షూట్ కూడా మొదలు కానుందని అంటున్నారు. అయితే హారర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాని అశ్విన్ తప్పుకున్నాడని అంటున్నారు అయితే ఆయన ప్లేస్ లోనే ఇప్పుడు నందిని రెడ్డి రాబోతోందని సమాచారం.

శరవణన్ ఇచ్చిన స్టోరీ మొత్తాన్ని కాస్త చిన్న చిన్న మార్పులతో నందినీ రెడ్డి ఈ సినిమాని రూపొందించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని దసరాకు మొదలు పెట్టి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సోనీ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమని పాన్ ఇండియా సినిమాగా చేయనున్నట్టు చెబుతున్న్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే దాకా దీనిని కూడా నమ్మలేం అనుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: