అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భర్త పుట్టినరోజు సందర్భంగా వెకేషన్ కు వెళ్లిన ఆ జంట నిన్న హైదరాబాద్ చేరుకుంది. దాదాపు వారం రోజుల పాటు మూడో మనిషితో సంబంధం లేకుండా ఈ జంట మాల్దీవ్స్ బీచ్ లో ఎంజాయ్ చేసింది. ఎట్టకేలకు నిన్న హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కింది. అయితే ఇప్పుడు సమంత బిహేవియర్ చర్చనీయాంశంగా మారింది.

. ఎందుకంటే గతంలో గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియా ఫ్యాన్స్ ని హీటెక్కించిన ఈ భామ ఇప్పుడు పూర్తిగా గ్లామర్ షో కి దూరం అయింది. సినిమాల్లో గ్లామర్ షో చెయ్యటం ఎప్పుడో ఆపేసిన ఈమె సోషల్ మీడియా ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు కాస్త హద్దు దాటి ఫోటోలు షేర్ చేస్తూ ఉండేది. అయితే ఈ మాల్దీవ్స్ ట్రిప్ లో మాత్రం ఒక్క గ్లామర్ ఫోటో కూడా షేర్ చేయకుండా పద్ధతిగా తెలుగింటి అమ్మాయిలా ఈమె తిరిగి వచ్చింది.

స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ బీచ్ లో విహరిస్తూ కూడా ఎక్కడా బికినీ లాంటి బట్టల్లో కనిపించలేదు. అయితే ఇదంతా మామ నాగార్జున కోసమే అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె స్కిన్ షో చేసిన సమయంలో నాగార్జున పరువు తీస్తోంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయ్యే వారు. నా వల్ల అక్కినేని కుటుంబం మొత్తం మాటలు పడడం ఎందుకు అనుకుందో ఏమో కానీ ఈ భామ ఇప్పుడు గ్లామర్ షో కి దూరం అయింది. అలా మొత్తానికి పూర్తిగా గ్లామర్ షో కి దూరమై అక్కినేని ఫ్యాన్స్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది ఈ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: