బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా కత్రినాకైఫ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ వ్యవహారం తెరపైకి వస్తుంది. కత్రినాకైఫ్, రణ్ భీర్ కపూర్ లు ఇద్దరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అని ఎదురుచూసే లోపే, కత్రినాకైఫ్ ని ఓ దర్శకుడు తల్లిగా మార్చబోతున్నాడు. అంటే కత్రినాకైఫ్ నిజంగా తల్లిగా మారబోతుందా అంటే దానర్ధం అస్సలు కానేకాదు. తను నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో కత్రినా తల్లి పాత్రను చేస్తుంది. దీంతో ఈ న్యూస్ హట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తూ, బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కత్రినాకైఫ్ స్టార్ డం ని క్రియేట్ చేసుకుంది. ఇదిలాఉంటే కత్రీనా కైఫ్ తాజాగా డీ గ్లామారైజ్డ్ పాత్రని చేయడానికి సిద్ధపడుతోంది. గతంలో రాజ్‌నీతి వంటి ప్రయోగాత్మక సినిమాలో కనిపించిన కత్రిన, మళ్లీ ఇప్పుడు ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో కనిపించడానికి ఒప్పుకుంది. ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా సుజయ్ ఘోష్ ఉంటున్నాడు. సుజయ్ ఘోష్ గతంలో కహానీ మూవీ ద్వారా విద్యాబాలన్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు కత్రినాని సైతం తల్లి పాత్రలో చూసించి మూవీని బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇందులో కత్రినా పాత్ర విభిన్నంగా ఉంటుందని బిటౌన్ టాక్. ఇందులో భర్తలేని ఒంటరి ఆడదానిగా కత్రినా కనిపించనుందట. పైగా ఆమె ఓ బిడ్డకు తల్లి కూడానట. ఈ మూవీని జపాన్ లో ’ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ అనే చిత్రం ఆధారంగా సుజయ్‌ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మొత్తానికి కత్రినాకైఫ్ ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేయటంతో బిటౌన్ అంతా ఈ మూవీపై తెగ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లీడింగ్ హీరోయిన్స్ అంతా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీల వైపే ఆసక్తి చూపుతున్నారు. కత్రినకైఫ్ ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో బిజిగా ఉంది. ఆ మూవీలు అనంతరం ఈ డి గ్లామరైజ్డ్ పాత్రలో నటించనుంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యేనాటికి 2016వ సంవత్సరం అవ్వొచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: